
ఉండవల్లి: ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారు, ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు సోమవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల కేబినెట్ హోదాలో గౌరవ సలహాదారుగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా మంతెన సత్యనారాయణ రాజు సేవలను ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు.