కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి

Written by TV2O TELUGU

Published on:

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23 విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. జులై నెలలో పీఎం కిసాన్ తదుపరి విడత నిధులు (23వ ఇన్‌స్టాల్‌మెంట్) విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

గత మార్చి 13న ప్రధాని నరేంద్ర మోదీ 22వ విడత కింద సుమారు 9.32 కోట్ల మంది రైతులకు రూ. 18,640 కోట్లు పంపిణీ చేశారు. చిన్న, సన్నకారు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఎకరాకు రూ.2,000చొప్పున ఏడాదికి రూ.6,000ఆర్థిక సహాయం అందిసుంది. జులైలో రాబోయే ఈ 23వ విడత నగదు పొందడం కోసం ఇప్పుడే మీ e-KYC , బ్యాంక్ వివరాలను ఒకసారి సరిచూసుకుంటే మంచిది.

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు పంటల సాగులో ఈ నిధులు పెట్టుబడికి ఉపయోగపడుతున్నాయి. పెరిగిన సాగు వ్యయాన్ని అనుసరించి పీఎం కిసాన్ సహాయ మొత్తం పెంచాలన్న డిమాండ్ రైతుల నుంచి వినిపిస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఈ విషయమై ఎలాంటి సానుకూలత వెల్లడికాలేదు.

Leave a Comment