
తెలంగాణ : హైద్రాబాద్ –
10వ తరగతి ఫలితాల్లో, నలుగురు విద్యార్థులు 600 మార్కులకు 597 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్లుగా నిలిచారు. వృతికా కృష్ణ (ఖమ్మం), మేధాన్ష్ శ్రీరామ్ (రంగారెడ్డి), శశాంక్ (సంగారెడ్డి), మధు (సంగారెడ్డి) రికార్డు మార్కులతో సత్తా చాటారు. మరో ఆరుగురు (లలిత్, సాత్విక్, రిత్విక, సాయి కవిత, చంద్రహాస్, ప్రణవ్) 596 మార్కులు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిసింది