బెజవాడ దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దర్శించుకున్నారు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం, అమ్మవారి దర్శనానికి విచ్చేసిన Honble జస్టిస్ జ్యోతిర్మయికి దుర్గగుడి ఈవో వీకే సీనా నాయక్ గ
మరియు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈవో సీనా నాయక్ పర్యవేక్షణలో న్యాయమూర్తి పర్యటన కొనసాగింది.. జస్టిస్ జ్యోతిర్మయి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందజేశారు.
బెజవాడ దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దర్శించుకున్నారు..
Written by TV2O TELUGU
Published on: