
వెస్ట్ బెంగాల్ :
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో సువేందు అధికారి వంటి సీనియర్ల నిష్క్రమణకు దారితీసిన ఆయన ‘షాడో సీఎం’ ధోరణి, డైమండ్ హార్బర్ మోడల్ పేరిట జరిగిన దౌర్జన్యాలు ఓటర్లలో వ్యతిరేకత పెంచాయి. మమత గుడ్డిగా మేనల్లుడిని సమర్థించడమే నేడు టీఎంసీ కొంపముంచిందనే చర్చ నడుస్తోంది.